వరంగల్ / పర్వతగిరి (ప్రజాజ్యోతి)::
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండా లో ఇందిరమ్మ ఇల్లు రాలేదని దారవత్ సుమన్ తండ్రి ధర్మ అనే వ్యక్తి గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటా నని దాదాపు మూడు గంటల పాటు నిరసన తెలిపాడు. గతంలో తన ఇల్లు కాలిపోయిందని, తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరి అతని నీ కిందికి దించి సముదాయించి నచ్చ చెప్పారు. స్థానికుల సమాచారం గత ప్రభుత్వం లో డబల్ బెడ్ రామ్ ఇల్లు ఇవ్వగా బెడ్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి చేశాడు అదే బెడ్ పై ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ చేయాలని నిరసన చేయడం మండల వ్యాప్తంగా చర్చనీ అంశంగా మారింది.