ఉర్సు ఉత్సవాలకు సీఎం ‘రేవంత్ రెడ్డి’ కి ఆహ్వానం

Warangal Bureau
1 Min Read

దామెర, మే 17 (ప్రజాజ్యోతి)::

దర్గా ఉర్సు ఉత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి ఆహ్వానం అందించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామ శివారులోని హజ్రత్ సైలాని బాబా దర్గాలో ఈ నెల 21, 22 తేదీలలో జరిగే ఉర్సు గంధం ఉత్సవాలకు హాజరు కావాలని పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ హామీద్ షామియా, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి శనివారం హైదరాబాద్ లో ఆహ్వానం అందించారు. ఈ సందర్బంగా దర్గా యొక్క విశిష్టతను బాబా సిఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భక్తులకు చేసే ఏర్పాట్లపై చర్చించారు. ఒంటె పై గంధం తీసుకువచ్చే జాతర యొక్క ప్రాముఖ్యతను, భక్తులకు గంధం జాతర పట్ల ఉన్న నమ్మకాన్ని సీఎం కు వివరించారు. 118 వ సైలాని బాబా ఉర్సు గంధం ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన వారిలో అబ్దుల్ రషీద్ అహ్మద్, సయ్యద్ మాసూద్ పాష ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *