దామరచర్లలో విజయశ్రీ జ్యువెలర్స్ ను కొల్లగొట్టిన దొంగలు
![]()
![]()
సుమారు 30 లక్షల విలువైన బంగారం అపహరణ
మిర్యాలగూడ, మే 09,( ప్రజాజ్యోతి ):
నల్గొండ జిల్లా..దామచర్ల మండల కేంద్రంలోని విజయశ్రీ జ్యువెలరీలో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షట్టర్ ధ్వసం చేసి సుమారు 30 తులాల బంగారు నగలు ఎత్తుకెల్లి నట్లు వాడపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేసిన షాప్ యజమాని కాలే బ్రహ్మయ్య.
సంఘటన స్థలానికి చేరుకొన్న రూరల్ సి ఐ పి ఎన్ డి ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.నల్లగొండ నుంచి క్లూస్ టీం రప్పించి ఆదారాలు సేకరిస్తున్నారు.
సి సి పుటేజీ దొరకుండా హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లిన దొంగలు. చేయితిరిగిన పాత నేరస్తుల పనిగా ప్రాథమిక అంచనాకొచ్చిన పోలీసులు.పక్క షాపు లో సిసి పుటేజీ పరిశీలిస్తున్నారు. దామరచర్ల లోని అద్దంకి – నార్కట్పల్లి ప్రధాన రహదారి ఉన్న బంగారం షాపులోనే దొంగతనం జరగటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఇదే రహదారి పక్కనున్న ఏటీఎం ను దొంగలు కొల్లగొట్టిన విషయం గమనార్హం.
దామరచర్లలో విజయశ్రీ జ్యువెలర్స్ ను కొల్లగొట్టిన దొంగలు
Leave a Comment