సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలు విడతలవారీగా మూసివేత!

V. Sai Krishna Reddy
1 Min Read

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలను విడతల వారీగా మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 60 రైళ్లను ఇతర స్టేషన్లకు మార్చారు. అలాగే, ప్లాట్‌ఫాంలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ రోజు నుంచి 5, 6 ప్లాట్‌ఫాంలను 13 రోజుల పాటు, ఆ తర్వాత 3, 4 ప్లాట్‌ఫాంలను మరో 50 రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి టర్మినళ్లకు 30 రైళ్లను దారి మళ్లించగా, ఇతర టర్మినల్స్ నుంచి చర్లపల్లి స్టేషన్‌కు 8 రైళ్లను మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *