కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వారి అధికారానికి పదవులకు అంతకు అంత ఆయుష్షు పెరుగుతుంది కాంగ్రెస్ లో గతంలో ఉన్న తీరున ఇపుడు లేదు. అప్పట్లో అయితే ప్రతీ ఆరు నెలలకూ ఒక సీఎం మారిపోయే సీన్ ఉండేది. దాని వల్ల రాజకీయంగా నష్టం ఎంతో ఉందని తర్వాత కాలంలో తెలుసుకున్న కాంగ్రెస్ తగిన జాగ్రత్తలు తీసుకుంది.
దాని వల్ల ఫుల్ టైం సీఎంలుగా చేసిన వారు కూడా కాంగ్రెస్ లో అనేక మంది ఉంటూ వచ్చారు. ఇక కాంగ్రెస్ కి ఇపుడు చూస్తే దేశంలో సొంతంగా మూడు రాష్ట్రాలలోనే అధికారం ఉంది. అందులో హిమాచల్ ప్రదేశ్ చిన్నది, సౌత్ లో చూస్తే కర్ణాటక, తెలంగాణా ఉన్నాయి. కర్ణాటకలో సీనియర్ మోస్ట్ లీడర్ గతంలో అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య సీఎం గా ఉన్నారు. తెలంగాణాలో చూస్తే డైనమిక్ లీడర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన గత పదహారు నెలలుగా సీఎం గా మంచి స్పీడ్ తోనే పనిచేస్తున్నారు.
ఎప్పటికప్పుడు హైకమాండ్ మనసు తెలుసుకుని దానిని అనుగుణంగా ఆయన పనిచేస్తున్నారు. కులగణనను జరిపిన స్టేట్ గా తెలంగాణాను ముందుంచిన రేవంత్ రెడ్డికి హైకమాండ్ వద్ద బాగానే గుర్తింపు ఉంది. ఇక ఏఐసీసీ మీటింగ్స్ లో రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు. తెలంగాణాలో కుల గణన జరిపి బీసీలకు 42 శాతం రిజవేషన్లు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిల్లుని కేంద్రానికి పంపిస్తే దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు
ఒక విధంగా చూస్తే ఏఐసీసీ మీటింగ్స్ లో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ప్రస్తావను అగ్ర నేత రాహుల్ గాంధీ తీసుకుని రావడం అంటే ఆయనకు ఎంతో గుర్తింపు ఇస్తున్నట్లుగానే చూస్తున్నారు. ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని కాంగ్రెస్ అగ్ర నేతలు ఆయనకు మద్దతుగా ఉన్నారని అనేక సందర్భాలలో రుజువు అయింది ఇలా ఒక పార్టీ మీటింగులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అతి పెద్ద డిమాండ్ అయిన కుల గణన ను అమలు చేసి చూపించిన సీఎం గా కనిపించడం అంటే ఆయన పలుకుబడి బాగా పెరిగింది అని అంటున్నారు.
అంతే కాదు రేవంత్ రెడ్డి ఇదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ పెద్దలు మెచ్చేలా పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణాలో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణాలో బీజేపీకి చోటు లేదని రేవంత్ రెడ్డి బిగ్ సౌండ్ చేశారు. బీజేపీని తాము అడ్డుకుని తీరుతామని ఆయన అన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పెద్దలకు నచ్చేలా ఒక రేంజి ఫైర్ తో రేవంత్ చేసిన స్పీచ్కూడా బాగానే మార్కులు పడ్డాయని అంటున్నారు.
అయితే రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం మీద ఏపీ బీజేపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం రేవంత్ రెడ్డి ఈ విధంగా బీజేపీ మీద విమర్శలు చేశారని అన్నారు. బీజేపీని అడ్డుకోవడం గాంధీ కుటుంబం వల్లనే కాలేదు, రేవంత్ రెడ్డి వల్ల ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే గుజరాత్ వేదికగా రెండు రోజుల పాటు సాగిన కాంగ్రెస్ ఏఐసీసీ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి అట్రాక్షన్ గా కనిపించారు. అంతే కాదు ఆయన పార్టీ పెద్దల వద్ద కూడా మంచి మార్కులు కొట్టేశారు అని అంటున్నారు