ఆర్య సమాజ మందిరంలో విశ్వ వసునామ సంవత్సర జెండా ఆవిష్కరణ
రామారెడ్డి మార్చ్ 31 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి ఆర్య సమాజ మందిరంలో నూతన సంవత్సర విశ్వా వసు నామ సంవత్సర సందర్భంగా ఓం జెండాను ఎగురవేసి తదనంతరం యజ్ఞ కార్యక్రమంలో నూతన సంవత్సరానికి సంబంధించిన వేదమంత్రాలతో హారతులు ఇవ్వడం జరిగింది.రామారెడ్డి ఆర్య సమాజం వైపు నుండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమం 11 గంటలకు ముగిసింది. ఇందులో రామారెడ్డి అధ్యక్షులు గుండ హరినాథ్ ఆర్య, కార్యదర్శి గొల్లపల్లి లక్ష్మా గౌడ్, పడిగల శ్రీనివాస్, అంగులూరి ప్రకాష్, నవీన్,మాదాసు రాజలింగం, గుండ ఉమాకాంత్, సుప్పని గంగాధర్, అనంత లక్ష్మి, రామస్వామి,ఆర్య సమాజ అభిమానులు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.