గంగమ్మ వాగు పనులు త్వరగా పూర్తి చేయండి
–స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు
— మండల బిఆర్ఎస్ నాయకులు
రామారెడ్డి మార్చ్ 31(ప్రజా జ్యోతి)
రామారెడ్డి గంగమ్మ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించి బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు రామారెడ్డి గంగమ్మ వాగు నిర్మాణ పనులను గత ప్రభుత్వము మంజూరు చేయడం జరిగినది. ఈ యొక్క పనులు నత్తనడకన సాగుతున్నాయి దీనిపై శ్రద్ధ చూపి వారు ఎవరు? పర్యవేక్షణ కరువై కాలయాపన చేస్తున్న నాయకులు త్వరగా స్పందించి. నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన పనులకు నిధులు కేటాయించకపోగా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేకపోవడం వలన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం జరిగినది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఈ మార్గము గుండా పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు, రైతులు వెళ్లేందుకు ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. గతం వర్షాకాలం సీజన్ లో వావ్ యొక్క వరద వృద్ధికి తాత్కాలిక రోడ్డు నిర్మించి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ వడ్డ లారీలు, భారీ వాహనాలకు రాకపోకలు లేకపోగా కొన్ని బోర్డుతాబడ్డ సంఘటనను కూడా తలెత్తాయి అదేవిధంగా రాబోయే వర్షాకాల సీజన్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నందున దయచేసి వెంటనే నిధులను కేటాయించి బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లేని ఎడల రాబోయే రోజులలో పెద్ద మొత్తంలో రోడ్డు నిర్బంధం చేసి ధర్నా కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగేల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి మైపాల్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెం శ్రీకాంత్,జంగం లింగం, ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.