ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

V. Sai Krishna Reddy
1 Min Read

ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

హాలియా,మార్చి30(ప్రజా జ్యోతి)
శ్రీ విశ్వా వసు తెలుగు సంవత్సరం అంతా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొందూరు జైవీర్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు.యువకులు రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు శాగం పెద్దిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్, కరెడ్ల నరసింహ పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *