యేళ్లకేళ్లుగా నానుతున్న 2018 బ్యాచ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ అభ్యర్ధులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. ఆయన ఈ మేరకు వెల్లడించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్, ప్రజావాణి ఇన్ఛార్జి డాజి చిన్నారెడ్డి మీడియాకు తెలిపారు. మార్చి 25న ప్రజా భవన్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆయన్ను కలిసి నియామక ప్రక్రియపై వివరాలు కోరారగా.. స్పందించిన చిన్నారెడ్డి పోలీస్ రిక్రూట్మెంట్ ఛైర్మన్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చెప్పడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.