దామెర/ప్రజాజ్యోతి:
గో- ఆధారిత వ్యవసాయ సాగు పై రైతులు దృష్టి సారించాలి..
* రిటైర్డ్ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త జలపతిరావు..
* జె బి డి వ్యవసాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు..
రాష్ట్రంలో రైతులు ఆధునిక సాంకేతిక రంగంలో వ్యవసాయ పద్ధతులు పాటించడంతోపాటు గో-ఆదారిత వ్యవసాయ సాగు పట్ల రైతులు మొగ్గు చూపాలని రిటైర్డ్ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త జలపతిరావు అన్నారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా (జె బి డి) వ్యవసాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గూడపాడ్ ఎన్ ఎస్ ఆర్ గార్డెన్ లో జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు ఆధ్వర్యంలో రైతులతో అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా రిటైర్డ్ వ్యవసాయ శాస్త్రవేత్త జలపతిరావు పాల్గొనగా, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు, జోర్దార్ రాములు, జిల్లాల నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు (ఖమ్మం) ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పి ఆర్ ఓ శరత్ (నెల సాగు యాంకర్) రాజేశ్వరరావు, లింగంపల్లి ప్రసాద్ రావు, బాబురావు, పలువురు సొసైటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వ్యవసాయ సంఘం సొసైటీ నాయకులు, రైతులు, ప్రముఖ వ్యవసాయ శాఖ నిపుణులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ సంక్షేమ సంఘం అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు ఆధ్వర్యంలో వ్యవసాయ రంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కృషిచేసిన వారిని ఉగాది పురస్కారాల సందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. రైతు అవగాహన సదస్సుకు ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో జరిగిన రైతు సదస్సుకు సేంద్రియ, గో-ఆధారిత, వర్మీ కంఫర్ట్ ఎరువులతో రైతులు సాగు చేసి పండించిన వరి ధాన్యాన్ని, బియ్యం ను, పలు రకాల పూలతో తయారుచేసిన సుగంధద్రవ్యాలు, ఆయుర్వేదంతో తయారుచేసిన పలు రకాల మెడిసిన్ తో కూడిన ఎగ్జిబిషన్ ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వ్యవసాయ శాస్త్రవేత్త జలపతిరావు మాట్లాడుతూ, రాను రాను వ్యవసాయ పంటలకు రైతులు ఉచ్చలవిడిగా రసాయన ఎరువులను పురుగుమందులను వాడడంతో భూమి సారం తగ్గడంతో పాటు, ప్రజలకు కూడా కొంతమేర నష్టం జరుగుతుందని అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు గో ఆధారిత వ్యవసాయ పంటలను కూడా రైతులు అలవాటు చేసుకోవాలని, దానివలన రైతులకు కొంతమేర ఇబ్బంది ఏర్పడిన రాను రాను రైతుల రాబడి పెరుగుతుందని జలపతిరావు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరుపతిరావు సాంద్రీయ, గో- ఆదారిత సాగుపట్ల అనేక విధాలుగా కృషి చేయడం అభినందనీయమన్నారు. గో- ఆదారిత వ్యవసాయ పద్ధతులతో రైతులకు లాభదాయం ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండేందుకు కృషి చేస్తున్న తిరుపతిరావు కృషి ఫలించాలని పలువురు వ్యక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. జిల్లాలతో పాటు రాష్ట్రాల్లో గో ఆధారిత వ్యవసాయ సాగు పెరిగి, ముల్కనూరి రైతు సొసైటీ సంఘం ల అభివృద్ధి చెందాలని పలువురు కోరుకున్నారు. జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరుపతిరావు ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం రైతు బీమా పథకాలతో పాటు, నేల సాగు పరిశీలన పంటల సాగు, విత్తనాలు కొంతమేర తగ్గించి ఇవ్వడంతో పాటు ఉచితంగా సభ్యత్వం తీసుకున్న వారికి అందజేయడం అభినందనీయమన్నారు. సొసైటీ అభివృద్ధికి వ్యవసాయ రంగ నిపుణులు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు ప్రజాప్రతినిధులు తమ వంతు కృషి అందించాలని జిల్లా అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు ఈ సందర్భంగా కోరారు.