హసన్ పర్తి, ప్రజాజ్యోతి:
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రం లో చెరువు మూల మలుపు వద్ద టిప్పర్ మరియు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్వి చక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు.
సీతంపేట వాస్తవ్యులు దుర్గం పవన్ కళ్యాణ్ మరియు బౌతు మహేష్ ఇద్దరు 22 సంవత్సరాల వయస్సు కలిగి నేతకాని కులానికి చెందిన వీరు హసన్ పర్తి నుండి సీతంపేట కి వెళ్తున్న క్రమంలో హుజురాబాద్ వైపు నుండి వస్తున్న టిప్పర్ ఢీ కొనడం వల్ల ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.