ఎన్‌ఆర్‌ఐల కొత్త భయం: ప్రమాదంలో గ్లోబల్ ఆదాయం

V. Sai Krishna Reddy
1 Min Read

భారత ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక వ్యవహారాలను గతంలో ఎన్నడూ లేనంతగా గమనిస్తోంది. విదేశీ బ్యాంక్ ఖాతాల నుండి విదేశీ వ్యాపారాల వరకు ఏదీ దాచిపెట్టలేనిది మారింది. మీరు RNOR (Resident but Not Ordinarily Resident) గా అర్హత పొందితే, మీ గ్లోబల్ పాసివ్ ఆదాయం, విదేశీ బ్యాంక్ వడ్డీ, స్టాక్ డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్ పై భారతదేశంలో పన్ను విధించబడుతుంది. మీ విదేశీ ఆస్తులను నివేదించకపోతే 300% జరిమానా లేదా జైలు శిక్ష తప్పనిసరి. విదేశాల్లో వ్యాపారం నిర్వహిస్తూ భారతీయ క్లయింట్ల నుండి ఆదాయం పొందినా అది కూడా పన్నుకు లోబడి ఉంటుంది. మీకంపెనీకి భారతదేశంలో కార్యాలయం లేకపోయినా అది భారతదేశానికి పన్ను చెల్లించాల్సిన అవసరం రావచ్చు.
ఎన్‌ఆర్‌ఐలకు పన్ను మినహాయింపులు పొందడం ఇప్పుడు కఠినమైన నియమాలతో కుదించబడింది. చిన్న పొరపాటు కూడా పెద్ద జరిమానాలకు దారి తీస్తుంది. ఇప్పుడు క్రిప్టో, స్టాక్స్, పెన్షన్ ఉపసంహరణ సహా అన్ని విదేశీ పెట్టుబడులు భారత ప్రభుత్వానికి పన్నుల కోసం నివేదించాల్సి ఉంటుంది. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) ప్రకారం ఎన్‌ఆర్‌ఐలు ఊరట కోసం ఆశిస్తే అదీ కష్టతరం కానుంది. మరిన్ని పత్రాలు సమర్పించాలని ప్రభుత్వం కోరుతోంది. దీన్ని టాక్స్ ఎగవేయడానికి ఉపయోగించేవారు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *