తాను మునిగి.. కేజ్రీని ముంచుతున్న కాంగ్రెస్‌

V. Sai Krishna Reddy
1 Min Read

తాను మున‌గ‌డమే కాకుండా.. ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ ముం చేస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు

తాను మున‌గ‌డమే కాకుండా.. ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ ముంచేస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ప‌లు చానెళ్లు చ‌ర్చ చేప‌ట్టా యి. దీనిలో జాతీయ స్థాయి విశ్లేష‌కులు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంద‌ని ఒక్క కేకే స‌ర్వే మాత్ర‌మే చెప్పిన ద‌రిమిలా.. ఆప్ ఓట‌మి..కి కార‌ణాలు వెతికే ప‌ని ప్రారంభించారు. దీనిలో ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీ తెర‌మీదికి వ‌చ్చింది. జాతీయ స్థాయిలో 2024లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆప్‌తో క‌లిసి కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది.

కానీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం ఆప్‌తో విభేదించింది. వాస్త‌వానికి కేజ్రీవాల్ 5-10 స్థానాల‌ను ఇచ్చేందుకు ఆదిలో ముందుకు వ‌చ్చారు. కానీ, కాంగ్రెస్ 25 స్థానాల‌కు ప‌ట్టుబ‌ట్టింది. దీంతో కేజ్రీవాల్ ఒంట‌రి పోరుకు రెడీ అయ్యారు. దీంతో బెట్టు పోయిన కాంగ్రెస్ తాము కూడా ఒంటరి పోరు చేస్తామ‌నిప్ర‌క‌టించి.. 70 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఇది పెద్ద త‌ప్ప‌ని అప్ప‌ట్లోనే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. కాంగ్రెస్ పార్టీ పావుకునేది ఏమీ లేద‌ని.. ఉన్న ఓట్లను చీల్చ‌డం ద్వారా బీజేపీకి మేలు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింద‌ని.. పెద్ద ఎత్తున వ్యాసాలు, విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి.

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *