ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ 

V. Sai Krishna Reddy
1 Min Read

ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ

కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ అయ్యేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. లోకేష్ కేంద్ర మంత్రిని కలవడానికి ముందుగానే లోకేష్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం సొంతరాజకీయాలు చేసుకుంటున్నారు. జనసురాజ్ పేరుతో బీహార్ లో పార్టీ పెట్టుకుని అగ్రెసివ్ గా పోరాటం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన నారా లోకేష్ ను కలిసేందుకు ఢిల్లీ వచ్చారు. ఏ అంశంపై చర్చిస్తారన్నదానిపై స్పష్టత లేదు.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పనుులు చేయడంలేదు. ఐ ప్యాక్ నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చారు. అయితే లోకేష్, చంద్రబాబుతో మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పని చేసిన రాబిన్ శర్మ ఇప్పటికీ టీడీపీకి పని చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీని రివైవ్ చేసేందుకు ఆయన ప్రణాళికలు రెడీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడటం లేదు.

బీహార్ ఎన్నికల విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఒంటరిగా పోటీ పడుతున్నారు. ఉపఎన్నికల్లో ఆయన పార్టీ తరపున పోటీ చేసిన స్థానాల్లో అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకల విషయంలో ఆమరణదీక్షచేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన గేమ్ ఛేంజర్ అవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే బీహార్ ఎన్నికల విషయంలో నారా లోకేష్ చేసేదేమీ ఉండదు. ఏ అంశంపై లోకేష్ తో భేటీ అయ్యారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *