నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు 

V. Sai Krishna Reddy
2 Min Read

నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు

 

ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య

హైదరాబాద్ – సంచలనం రేపిన పుప్పాలగూడ జంట హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు

ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ప్రయత్నించగా అంగీకరించలేదని మహిళను, ఇదే విషయంలో హెచ్చరించినందుకు ఆమె ప్రియుడిపై కక్ష గట్టి హతమార్చినట్లు తెలిపిన పోలీసులు

మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ ఉపాధి కోసం హైదరాబాద్ లోని నానక్ రాం గూడకు వచ్చాడు.. హౌస్ కీపింగ్ పనిచేస్తున్న సమయంలో అతడికి ఛత్తీస్ ఘడ్‌కు చెందిన బిందుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది

అప్పటికే ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. వీరి సంబంధం తెలుసుకున్న బిందు భర్త.. వనస్థలిపురం పరిధిలోని చింతలకుంటకు మకాం మార్చాడు. అయినా బిందు, సాకేత్‌ల మధ్య బంధం కొనసాగింది

ఈ క్రమంలోనే ఆమె సాకేత్ సాయంతో వ్యభిచారం మొదలు పెట్టింది.. ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్‌కు చెంది గచ్చిబౌలిలో నివసించే సాకేత్ స్నేహితులు రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుఖేంద్రకుమార్లు బిందును తమ వద్దకు తీసుకురావాలని చెప్పారు

దీంతో ఆమె జనవరి 8న భర్తకు చెప్పకుండా సాకేత్‌తో గచ్చిబౌలికి వచ్చి అతడి గదిలోనే ఉంది. రెండుసార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్ కుమార్.. సెల్‌ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డు తెలిపి సాకేత్‌కు చెప్పింది

అతడు రాహుల్‌ను గట్టిగా హెచ్చరించడంతో గొడవ జరిగింది

కక్ష గట్టిన రాహుల్.. బిందు, అంకిత్లను హతమార్చాలని నిర్ణయించుకుని రాజ్, సుఖేంద్రల సాయం తీసుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం రాహల్ ఈ నెల 11న అంకిత్ ద్వారా బిందును మరోసారి పిలిపించుకున్నాడు

అదేరోజు రాహుల్, రాజ్, సుఖేంద్రలు సాకేత్, బిందులను ఆటోలో పుప్పాలగూడ అనంత పద్మస్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అందరూ మద్యం తాగుతుండగా సుఖేంద్ర.. బిందును పక్కకు తీసుకెళ్లాడు

అంకిత్ ఒంటరిగా ఉండడంతో అదే అదనుగా భావించిన రాహుల్, రాజ్ కుమార్లు కత్తితో పొడిచి బండరాయితో కొట్టి చంపారు. ఆ తర్వాత బిందును హతమార్చారు

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *