ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరాలి సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 17(ప్రజాజ్యోతి):ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో ని సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉద్యోగులకు రోడ్డు నియమాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రత ప్రమాదాల నివారణకు సంబంధించిన సూచనలు చేసిన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భద్రతా అంశాల గురించి పోలీస్ శాఖ వివరించడం జరుగుతుందని ఎస్సై తెలిపారు దీనిలో భాగంగానే రోడ్ భద్రత పట్ల అవగాహన కార్యక్రమాల ద్వారా వాహనదారులను ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని అన్నారు.ప్రమాదాల నివారణకు అవగాహన నియమాలు పాటించడమే ప్రధాన మార్గమని అన్నారు.ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని తప్పుడు మార్గంలో వాహనాలు నడపకూడదని ఎక్కడపడితే అక్కడ రోడ్లు దాటకూడదని ఈ సందర్భంగా తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *