- బస్సు ఢీకొని తండ్రీకొడుకు, అల్లుడు మృతి
నర్సాపూర్/కొల్చారం (ప్రజాజ్యోతి) మండలంలోని రాంపూర్ శివారులో (నేడు) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బూరుగుపల్లికి చెందిన అమృత్ గౌడ్ (50), ఆయన కుమారుడు రిషివర్ధన్ (12), అల్లుడు సాయిగౌడ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను మెదక్ ఆసుపత్రికి తరలించారు.
