నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. రెడ్ సిగ్నల్ ఉన్నా లెక్కచేయకుండా బైకర్లు, ఆటోలు ప్రమాదకరంగా వెళ్తున్నారు. వాహనాల అడ్డదిడ్డమైన రాకపోకలతో రోడ్డు దాటాలంటేనే జనం జంకుతున్నారు. లక్షలు ఖర్చు చేసి సిగ్నల్స్ ఏర్పాటు చేసినా, పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉల్లంఘనలు పెచ్చుమీరుతున్నాయి.
