ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం

Warangal Bureau
1 Min Read
  • ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం

జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు

పర్వతగిరి, జనవరి 15 (ప్రజా జ్యోతి):

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోరుగుట్ట తండాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, తండా సర్పంచ్ బానోత్ విజయలక్ష్మి భాస్కర్ నాయక్‌తో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని వివిధ ఆకృతుల్లో రంగురంగుల ముగ్గులు వేసి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పోటీల్లో

మొదటి బహుమతి – బానోతు అనూష (రూ.2,000 నగదు + పట్టు చీర),

రెండో బహుమతి – బానోతు అఖిల (రూ.1,500 నగదు + పట్టు చీర),

మూడో బహుమతి – గుగులోతు మమత, ప్రమీల (రూ.1,000 నగదు + పట్టు చీర),

నాలుగో బహుమతి – భూక్య అనూష (రూ.500 నగదు) అందుకున్నారు.

అదనంగా, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ షీల్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వంగాల రవీందర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పల్లెపాటి శాంతిరథన్ రావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వ్యాగ్యా నాయక్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *