కాలభైరవ ఆలయ దుకాణాల వేలం
- — ఈవో ప్రభు రాంచంద్రం
- రామారెడ్డి అక్టోబర్ 29 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి – రామారెడ్డి లో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ కాల భైరవ స్వామి చేవస్థానము నందు ఉన్న కిరాణా సముదాయము కిరాణ, తూసవేళ్లు, కూల్ డ్రింక్స్ టెంకాయలు దుకాణాముకు దెవస్థానము నందు బహిరంగ వేలము నిర్వహించనైనది ఇందులో 10 మంది డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు.ఈ వేలం పాటలో అధిక వేలం పాడిన పాటదారుడు బండి. జగన్నాథం దోమకొండ వారు 6,00,000/-ఆరు లక్షలు రూపాయలకు ఒక్క సంతత్సరమునకు గాను వేలము పాట దక్కించుకున్నారు.ఈ యొక్క వేలమునకు ముఖ్యఅతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ సూపర్వైజర్ ఎస్. సుమన్ జూనియర్ అసిస్టెంట్ సమక్షంలో నిర్వహించడం జరిగిందని, కార్యనిర్వహణాధికారి ప్రభు రాంచంద్రం తెలిపారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ, సహాయకులు నాగరాజు, భరత్, టెండర్ పోటీ దారులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
