పండుగ వేళ… కియా ఆఫర్ల మోత

V. Sai Krishna Reddy
1 Min Read

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తమ వినియోగదారులకు ఓ బంపరాఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్ఠంగా రూ. 2.25 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్‌లో ప్రీ-జీఎస్టీ ఆదాతో పాటు పండుగ ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 22 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

కియా అందిస్తున్న ఈ ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కియా సెల్టోస్ మోడల్‌పై గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇదే రాష్ట్రాల్లో కారెన్స్ క్లావిస్ మోడల్‌పై రూ. 1,33,350 వరకు, కారెన్స్ కారుపై రూ. 1,20,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. దేశవ్యాప్తంగా చూస్తే కేరళలో సెల్టోస్‌పై అత్యధికంగా రూ. 2.25 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఆఫర్‌లో భాగంగా ప్రీ-జీఎస్టీ కింద రూ. 58,000 వరకు, పండుగ ప్రయోజనాల రూపంలో రూ. 1.67 లక్షల వరకు లాభం చేకూరుతుందని కంపెనీ తెలిపింది. సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ వంటి పాపులర్ మోడళ్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ (సీఎస్ఓ) జూన్సు చో మాట్లాడుతూ, “పండుగలంటే సంతోషాలు, కొత్త ఆరంభాలు. ఈ సీజన్‌ను మా కస్టమర్లకు మరింత ప్రత్యేకంగా మార్చాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన ఆఫర్లతో వినియోగదారులు తమకు ఇష్టమైన కియా కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. కియా కారు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదని, జీవితంలో సౌకర్యాన్ని, ఆనందాన్ని నింపుతుందని మేము విశ్వసిస్తున్నాం” అని తెలిపారు. ఆసక్తి ఉన్న వినియోగదారులు సమీపంలోని కియా షోరూమ్‌లను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *