నేపాల్‌లో కల్లోల పరిస్థితులు .. జైళ్ల నుంచి 7వేల మంది ఖైదీలు పరార్

V. Sai Krishna Reddy
1 Min Read

నేపాల్‌లో ఇటీవల యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల కారణంగా దాదాపు ఏడు వేల మంది ఖైదీలు జైళ్ల నుంచి పరారయ్యారు. కొందరు ఖైదీలు భద్రతా సిబ్బందిపై దాడులు చేసి, జైళ్లకు నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ సంఘటనల వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొంది.

బాల సదనంలో కాల్పులు – ఐదుగురు మైనర్ల మృతి

నౌబస్తాలోని ఓ బాల సదనంలో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. భద్రతా సిబ్బంది వద్ద ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన మైనర్లపై కాల్పులు జరగడంతో ఐదుగురు మైనర్లు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతుల కుటుంబాలు, మానవ హక్కుల సంస్థలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

జైళ్లపై ఖైదీల దాడులు.. పరార్

నేపాల్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితులను జైళ్లలోని ఖైదీలు అవకాశంగా తీసుకున్నారు. జైళ్లకు నిప్పు పెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ల నుంచి దాదాపు ఏడువేల మంది ఖైదీలు పరారయ్యారు. రాజ్‌బిరాజ్, ఝుంప్కా, దిల్లీబజార్, చిట్వాన్, నక్కూ, కైలాలీ, జాలేశ్వర్ మొదలైన జైళ్ల నుంచి వేల మంది ఖైదీలు తప్పించుకున్నారు.

సింధూలిగఢీ జైలులో 43 మంది మహిళలతో సహా మొత్తం 471 మంది ఖైదీలు పారిపోయారు. నవాల్‌పరాసీ వెస్ట్ జిల్లా జైలు నుంచి 500 మంది ఖైదీలు తప్పించుకున్నారు. నౌబస్తా బాల సదనం నుంచి 76 మంది మైనర్లు పరారయ్యారు.

పారిపోయిన ఖైదీల్లో కొందరు భారతదేశం-నేపాల్ సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ జిల్లాలోకి చొరబడ్డ ఐదుగురు ఖైదీలను భారత సశస్త్ర సీమా బలగాలు (ఎస్ఎస్‌బీ) అదుపులోకి తీసుకున్నాయి. దిల్లీబజార్ జైలు నుంచి పారిపోతున్న ఓ ఖైదీని స్థానికులు పట్టుకుని సైన్యానికి అప్పగించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *