వైద్య రంగంలో సూర్యాపేట గణనీయమైన అభివృద్ది సాధించింది సూర్యాపేట ఐఎంఏ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్

Nalgonda Bureau
2 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూన్ 30(ప్రజాజ్యోతి):దేశంలో వైద్యుల కృషి ఫలితంగానే స్మాల్ ఫాక్స్ పోలియో డయేరియా వంటి వ్యాధులు నిర్మూల చేయడం జరిగిందని,కరోనా సమయంలో దాదాపుగా 1500 మంది వైద్యులు దేశంలో మృత్యువాత పడినారని,యాభై లక్షల మంది ప్రజలు మరణించారని సూర్యాపేట ఐఎంఏ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు.జూలై 1వ తేదిన డాక్టర్ బిసి రాయ్ జన్మదినం సందర్భంగా జరుపుకునే జాతీయ డాక్డర్స్ డే సంధర్భంగా సోమవారం సాయంత్రం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ డాక్టర్ డే సందర్భంగా వైద్యులకు నర్సింగ్ సిబ్బందికి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట నేడు వైద్యరంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని అన్నారు.ఒకప్పుడు ఎక్స్ రె మాత్రమే ఉన్న సూర్యాపేట నేడు ఎంఆర్ఐ పరీక్షలు కూడా చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు.వైద్య రంగంలో ఘననీయమైన అభివృద్ధితో నేడు హైదరాబాదులో బైపాస్ సర్జరీ చేసే స్థాయికి వచ్చామని,రేపు సూర్యాపేటలో కూడా వైద్యులు బైపాస్ సర్జరి చేయగల స్థాయికి చేరుకుంటామని అన్నారు.ఏ డాక్టర్ కూడ ప్రజల ప్రాణాలు తీయాలని అనుకోరని,కానీ కొన్ని అనుకోని పరిస్థితులలో పేషెంట్లు మృతి చెందడం జరుగుతుందని కాబట్టి పేషెంట్ల బంధువులు వైద్యులతో సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.నేడు సూర్యాపేటలో 200 మంది వైద్యులు వివిధ హాస్పిటల్ లో పనిచేస్తున్నారని అనేక ఆథునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని ఆధునిక వైద్యం కూడా సూర్యాపేటలో అందుబాటులో వచ్చాయని అన్నారు.కార్డియాలజీ ఆర్థోపెడిక్,ఎండోస్కోపి మరియు ఇతర సేవలు సూర్యాపేటలో అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు.ప్రజలకు మరింత సేవలు అందించడానికి ఐఎంఏ నిరంతరం పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ దాంగ్డె ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ మరియు సంజీవ్ కుమార్ డాక్టర్లు పాల్గొన్నారు.సూర్యాపేట ఐఎంఏ ట్రస్ట్ అధ్యక్షులుగా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ఎన్నికైన సందర్భంగా పలువురు డాక్టర్లు అభినందనలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *