పోలీస్ కళాబృందం చే అవగాహన సదస్సు

Kamareddy
1 Min Read

పోలీస్ కళాబృందం చే అవగాహన సదస్సు

సైబర్ నేరాలలు, సామాజిక అంశాలపై

స్థానిక ఎస్సై ఎస్. రాజారాం

రామారెడ్డి జూన్ 28 (ప్రజా జ్యోతి)

కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం, రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం సబ్ఇన్స్పెక్టర్ ఎస్.రాజారాం,ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం రామారెడ్డి హై స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా షి టీమ్స్ టోల్ ఫ్రీ నెంబర్ 8712686094,సైబర్ నేరాల పట్ల అవగాహన రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్,మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి పట్టొద్దని మహిళలు చిన్న పిల్లలపై జరుగు హత్య నేరాలు బాల్య వివాహాలు మరియు చిన్న పిల్లల పై జరిగే నేరాలపట్ల బరోసా షిటీం అవగాహన కల్పించడం జరిగింది.టోల్ ఫ్రీ నెంబర్ 1098 కాల్ మానవ అక్రమ రవాణా జరుగుతున్నా నేరాల పట్ల పిసి.రాజేందర్ అవగాహన కల్పించారు.పై మొదలగు అంశాలపై అత్యవసర సమయంలో డయల్ 100 కు సైబర్ నేరాలు నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఉపయోగం,సామాజిక అంశముల పైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో హై స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయ సిబ్బంది, పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి,యు.శేషారావు లు పాటల, మాటల ద్వారా వారికి అర్థమయ్యే విధంగా విద్యార్థులకు వివరించి కార్యక్రమం విజయవంతం చేయడమైనది. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది ఎస్సై రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *