ఆర్ఎన్ఐ లేని పత్రికలపై వేటు… ఆదేశాలు జారీ చేసిన పిజీఆర్ఐ…

Nizamabad Bureau Sanjeev Yedla

ఆర్ ఎన్ ఐ లేని పత్రికలపై వేటు

హైదరాబాద్ :

రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా (ఆర్ ఎన్ ఐ) లేకుండా టెల్ నెంబర్ లేకుండా పత్రిక లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోండి అని ప్రెస్ రిజిస్ట్రేషన్ జనరల్ ఆఫ్ ఇండియా (పి ఆర్ జీ ఐ) కఠిన ఆదేశాలు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కు ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఈ ఆదేశాలను జిల్లా డి పి ఆర్ ఓ లకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పిఆర్జీఐ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పై అ సత్య వార్తలు ప్రచురిస్తూ, దేశంలోని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరించే విధంగా కొన్ని ఆర్ఎన్ఐ లేని పత్రికలు సత్య దూరం లేని వార్తలు ప్రచురించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాధికంగా పిడిఎఫ్ పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్ నరహరి నాగేశ్వర ప్రసాద్, పి జీ ఆర్ ఐ న్యూఢిల్లీ అప్పీలు చేసారు. ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సదరు పిర్యాదు పై లోతుగా అధ్యయనం చేసి ఆర్ ఎన్ ఐ లేని పత్రికలపై వేటు కు రంగం సిద్ధం చేసింది. కఠిన ఆదేశాలు జరీ చేస్తూ ఇక ముందు ఆర్ ఎన్ ఐ లేని పత్రికల వార్తలను ప్రామాణికంగా తీసుకోవద్దని తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలకు వెనుకాడబోవద్దని సూచింది., అలాగే పత్రిక భాషలో వాడాల్సిన పదాలు పూర్తి స్థాయిలో పొందుపరిచి ఉత్తర్వులు జారీచేసింది దీని గమనించి రాష్ట్ర జిల్లా పౌరసంబంధాల అధికారులు పరిగణించాలని ఆర్ ఎన్ ఐ లేని పత్రికల పూర్తి సమాచారాన్ని సదరు జిల్లా పౌరసంబంధాల అధికారులు సేకరించి రాష్ట్ర కార్యాలయాలకు పంపాలని ఆదేశాలు జరీ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *