వరంగల్, జూన్ 27 (ప్రజాజ్యోతి)::
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని దేవన్న పేట లో యేసు తిరు హృదయ దేవాలయ పండుగ ఘనంగా జరిగింది. వడ్డేపల్లి విచారణ కు చెందిన ఈ ఆలయ విచారణ గురువు ఫాదర్ గంగారపు నవీన్ అధ్యక్షత వహించారు. ఈ పండుగ కార్యక్రమానికి వరంగల్ పీఠ పాలనాధికారి దుగ్గంపూడి విజయపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ పాలనాధికారికి మహిళలు హారతులు ఇచ్చి కోలాటం తో బ్యాండ్ భాజాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాలనాధికరి ప్రత్యేక ప్రార్థనలు చేసి పూజ సమర్పించారు. అప్పటి విచారణ గురువు ఈ గ్రామ ఆలయానికి యేసు తిరు హృదయ అను మంచి పేరు పెట్టారన్నారు. దేవుడు ప్రేమ స్వరూపుడని మనలను నిత్యము ప్రేమించే దేవుడని ఖండించే వాడు కాదని దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలని బోధించారు. ఈ పండుగ పూజ లో దేవన్న పేట సంఘ ఉపదేశి, మరియు సంఘా పెద్దలు, ఇతర గ్రామాల సంఘ పెద్దలు గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు, యువతీ యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అందరూ సమిష్టి భోజనం చేశారు.