ఘనంగా దేవన్న పేట యేసు తిరు హృదయ దేవాలయ మహోత్సవం..

Warangal Bureau
1 Min Read

వరంగల్, జూన్ 27 (ప్రజాజ్యోతి)::

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని దేవన్న పేట లో యేసు తిరు హృదయ దేవాలయ పండుగ ఘనంగా జరిగింది. వడ్డేపల్లి విచారణ కు చెందిన ఈ ఆలయ విచారణ గురువు ఫాదర్ గంగారపు నవీన్ అధ్యక్షత వహించారు. ఈ పండుగ కార్యక్రమానికి వరంగల్ పీఠ పాలనాధికారి దుగ్గంపూడి విజయపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ పాలనాధికారికి మహిళలు హారతులు ఇచ్చి కోలాటం తో బ్యాండ్ భాజాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాలనాధికరి ప్రత్యేక ప్రార్థనలు చేసి పూజ సమర్పించారు. అప్పటి విచారణ గురువు ఈ గ్రామ ఆలయానికి యేసు తిరు హృదయ అను మంచి పేరు పెట్టారన్నారు. దేవుడు ప్రేమ స్వరూపుడని మనలను నిత్యము ప్రేమించే దేవుడని ఖండించే వాడు కాదని దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలని బోధించారు. ఈ పండుగ పూజ లో దేవన్న పేట సంఘ ఉపదేశి, మరియు సంఘా పెద్దలు, ఇతర గ్రామాల సంఘ పెద్దలు గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు, యువతీ యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అందరూ సమిష్టి భోజనం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *