ముక్త్యాల బ్రాంచ్ ఎత్తిపోతల పథకం పనుల పై ఉత్తమ్ అసంతృప్తి త్వరగా పూర్తిచేయాలని ఆదేశం 53 వేల ఎకరాలకు సాగునీరు హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబడమే తన లక్ష్యం

Nalgonda Bureau
1 Min Read

చింతలపాలెం,జూన్ 27 (ప్రజా జ్యోతి) :ముక్త్యాల బ్రాంచ్ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న తీరుపైఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపాలెం మండల కేంద్రంలోని వెల్లటూరు వద్ద నిర్మిస్తున్న ముక్త్యాల బ్రాంచ్ ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం సాగునీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాలు ఆశాజనకంగా పనిచేయడం లేదని రెవిన్యూ, ఇరిగేషన్, కాంట్రాక్టర్ లకు చురకలు అంటించారు. ఎట్టి పరిస్థితులను అనుకున్న సమయానికి ఈ ఎత్తిపోతల పథకం పనులు పూర్తవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని. భూ నిర్వాసిత రైతులకు సాధ్యమైనంతవరకు ఎక్కువ నష్టపరిహారం వచ్చేలా చూడాలని కలెక్టర్ కు సూచించారు. భూ నిర్వాసితులు పైప్ లైన్ వేసిన తర్వాత మళ్లీ ఆ భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చని అన్నారు. ముక్త్యాల బ్రాంచ్ ఎత్తిపోతల పథకం తో హుజూర్ నగర్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని, మొత్తం 53 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తనతోనే హుజూర్ నగర్ అభివృద్ధి సాధ్యమని అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *