మీడియా పై దౌర్జన్యం
పోలీసుల ఓవరాక్షన్…
జిల్లా ఆసుపత్రిలో ఆంక్షలు…
చోద్యం చూస్తున్న సూపరింటెండెంట్…
నిజామాబాద్, ప్రజాజ్యోతి, జూన్ 25 :
నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి(జిజిహెచ్) లో
అమానవీయ ఘటనపై
కవరేజికి వెళ్లిన మీడియాపై అక్కడి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. బాధితుల ఇంటర్వ్యూ చేస్తుండగా విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా కెమెరా లాక్కునే ప్రయత్నం చేశారు. ఇదంతా సినిమాలోలా ఆసుపత్రి సూపరింటెండెంట్ మౌనం వహించడం విశేషం.
ఆర్ముర్ మండలం పెర్కిట్ కు చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలు కాలినొప్పితో ఆసుపత్రి కి వచ్చారు. వైద్యం కోసం వచ్చిన ఆమెకు చికిత్స చేయకుండా బయట షెడ్డులోకి తరలించారు. ఈ విషయం తెలియడంతో
ప్రజా సంఘాలు, మీడియా దృష్టికి రావడంతో హుటా హుటిన ఆస్పత్రిలోకి వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసిన మీడియా ప్రతినిధులు వీడియో రికార్డు చేసారు. ఇది గమనించిన భద్రత పోలీసులు అక్కడికి హడావిడిగా వచ్చి మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. అరుబయట షెడ్డులో ఉన్న వృద్దురాలు వీడియో తీయకుండా అడ్డుకోవడమే కాకుండా చేయి చేసుకునే అంత పని చేసారు. మీరు అనుమతి తీసుకున్నారా.? ఎవరు అనుమతి ఇచ్చారు.? మీరు ఎలాంటి వీడియో తియ్యరాదు అంటు అడ్డుకున్నారు. అయితే అప్పటికే మీడియా ద్వారా అసలు విషయం బయటకు పొక్కడంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి స్పందించారు. స్వయంగా ఆసుపత్రికి వెళ్లి విచారణ జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంక్షలు ఎందుకు.?
నిత్యం వైద్య సేవల కోసం వెళ్లే రోగుల మధ్యన భద్రత పేరుతో జిజిహెచ్ లో పోలీసుల హంగామాకు అంతు లేకుండా పోతుంది. ఏ చిన్న సమస్య వచ్చిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది తీరు విస్మయానికి గురి చేస్తుంది. చివరకు ఏ కావరేజికి వెళ్లిన మీడియా పై చిందులు తొక్కడం, కెమెరా లాక్కునే ప్రయత్నాలు చేయడం గమనార్హం. అయితే ఇదంతా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలతోనే జరుగుతుందనే చెపుతున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ సైతం ఆసుపత్రి పాలనపై పట్టుకోల్పోయారానే ఆరోపణలు ఉన్నాయి.