స్థానిక ఎన్నికల కోసం ఆశవహుళ హడావుడి…..
ఎన్నికల కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న గల్లీ లీడర్స్….
కొందరి లోకల్ లీడర్స్ తో అధికార పార్టీకి తలనొప్పి…….?
చింతపల్లి జూన్ 25 (ప్రజాజ్యోతి) తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.స్థానిక సమరం కోసం నోటిఫికేషన్స్ రాకకోసం గ్రామాల్లో ఎదురు చూస్తున్నారు.అయితే గత ఏడాది జనవరి 31న తేదీతో పంచాయతీల సర్పంచ్ లా పదవికాలం పూర్తయింది ఇప్పటికి స్పెషల్ అధికారుల పాలనలో గ్రామాలు అభివృద్ధిలో కుంటుబడ్డాయి.గ్రామపంచాయతీల.నాటి నుండి నేటి వరకు ఇప్పటివరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల అభివృద్ధి అస్తవ్యస్తంగా మారాయి.దీంతో గ్రామాల్లో స్థానిక ఎన్నికలలో నిలబడడం కోసం కొందరు ప్రజల మెప్పుకోసం తోచినట్టుగా అభివృద్ధిలకు శ్రీకారం చూడుతున్నారు.ముఖ్యంగా ప్రధాన పార్టీలో గల్లీలో లీడర్ ముందుకోస్తున్నాడు.ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు బిఆర్ఎస్ నాయకులతో పాటు వామపక్ష లీడర్లు కూడా మేమున్నామంటూ గ్రామ జోరుకు ప్రచారం చేసుకుంటున్నారు. చింతపల్లి మండలంలోని మొత్తం 34 గ్రామ పంచాయతీలకు 15 నుండి 20 పంచాయతీలో మాత్రమే రిజర్వేషన్లు మారనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.మిగతా గ్రామపంచాయతీలో ఒకే కేడర్ కి సంబందించిన కులాలు ఉండటంతో ఎలాంటి మార్పు ఉండదని ఆయా గ్రామాల లీడర్లు బల్లగొట్టి చెపుతున్నారు.అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే స్టానికి ఎన్నికలే రసవత్తరంగా జరుగుతాయానీ ప్రచారం.ఇప్పటికే కొందరు లీడర్లు లోలోపల ఓటర్లను మభ్యపెడుతూ వాళ్లకు అవసరమైన చిన్నచితక పనులు చేసిపెడుతూ ఆకట్టుకుంటున్నారు.అయితే రిజర్వేషన్లు ఎటు తెలకపోవడంతో అయోమయంలో పడ్డారు.కొంతమంది లీడర్లు మాత్రం ఏకభిప్రాయంతో ఉన్నారు.పోటీలో పార్టీలు సహకరించక పోయిన అనుకునే విదంగా టికెట్ ఇవ్వకపోతే పార్టీలు మారుతామని లేదా పార్టీలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
“స్టానికి ఎన్నికలపై ఫోకస్ రోజుకో గ్రామపంచాయతీపై ప్రజాజ్యోతి లో ప్రత్యేక కథనం”