ఇందిరమ్మ రాజ్యంలో సబ్బండ వర్గాలకు మేలు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్

Nalgonda Bureau
2 Min Read

తొలకరి కి ముందుగానే రైతు భరోసా ఇచ్చిన తొలి రాష్ట్రం

ఇందిరమ్మ రాజ్యంలో సబ్బండ వర్గాలకు మేలు

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్

 

తుంగతుర్తి, జూన్ 24,(ప్రజా జ్యోతి):రైతుల సాగు కార్యకలాపాలకు తొలకరిలో ముందుగానే భరోసా ఇచ్చిన తొలి రాష్ట్ర తెలంగాణ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. రైతు నేస్తం వేదికగా మంగళవారం హైదరాబాదులో జరిగిన రైతు భరోసా సంబరాలను మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ .9వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసిందని అన్నారు. ఆనాడు వైఎస్ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తే నేడు రైతు బిడ్డ రేవంత్‌రెడ్డి రైతులకు అండగా ఉండి రుణమాఫీ చేశారని అన్నారు. ఈ పోరాటాల గడ్డ తుంగతుర్తిలో నా చెమట చుక్కలు ఉన్నాయని ఇంకా చెప్పు, ఈ ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ బి.ఎన్.రెడ్డి చేసిన పోరాటం తోనే నీళ్లు పారాయని అన్నారు. రానున్న మూడున్నర సంవత్సరాలలో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడి చేసి అన్ని రంగాలను నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల అనురాధ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, తహసిల్దార్ దయానందం,మండల సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ, ఏఈఓ సృజన, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి జనార్ధన్,పెద్ద బోయిన అజయ్, కొండరాజు, ఎనగందుల సంజీవ, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, నల్లు రామచంద్రారెడ్డి,దాసరి శీను, తప్పట్ల శంకర్, కలకోట్ల మల్లేష్, కాసర్ల గణేష్, పులి సత్తమ్మ, మాచర్ల అనిల్, రుద్ర రామచంద్రు, చిలకల వెంకన్న, మంగళపల్లి నాగరాజు,బొంకూరి నాగయ్య, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *