చిట్టీల పేరుతో.. అమాయకులకు శఠగోపం

V. Sai Krishna Reddy
1 Min Read

చిట్టీల పేరుతో.. అమాయకులకు శఠగోపం..!

సుమారు 2కోట్ల తో ఉడాయించిన మోసగాడు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

మిర్యాలగూడ, జూన్ 23,(ప్రజాజ్యోతి): చిట్టిల పేరుతో అమాయక జనం నుండి భారీ ఎత్తున వసూలు చేసి కేటుగాడు వారికి శఠగోపం పెట్టి పరారైన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. స్థానికులు,బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కటకం సైదిరెడ్డి గత 30 ఏళ్లుగా బియ్యం వ్యాపారం, చిట్టిల పేరుతో ప్రజలను నమ్మించాడు. 45 మంది బాధితుల నుండి చిట్టిల పేరుతో 1.50 కోట్ల కాజేసి గుట్టు చప్పుడు కాకుండా కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇంటికి తాళం వేసి ఉండడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతోమోసపోయామని గ్రహించినబాధితులు అతని ఇంటి ఎదుట ఆందోళనచేపట్టారు.అనంతరం టూటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా ఇంకా ఫిర్యాదు చేయని అనేక మంది బాధితుల నుండి సుమారు 4 కోట్లు కాజేసినట్టుసమాచారం.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని పట్టుకునే పనిలో ఉన్నారు.ఈ సందర్భంగా బాధితులుమాట్లాడుతూ.. తమ గోడు వెళ్ళబోసు కున్నారు. కూలి నాలి చేస్తూ రూపాయి రూపాయి కూడేసి చిట్టీలు కట్టామని సైదిరెడ్డి ఇలా మోసం చేస్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడు పై తగిన చర్యలు తీసుకొని తమ డబ్బులు ఇప్పించా లంటూవేడుకుంటున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *