యువకులు డ్రగ్స్ నుండి అప్రమత్తంగా ఉండాలి

Nalgonda Bureau
1 Min Read

యువకులు డ్రగ్స్ నుండి అప్రమత్తంగా ఉండాలి నాగారం మండల ఎస్ఐ ఐలయ్య అని అన్నారు.ఆదివారం నాగారం మండల కేంద్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా నాగారం సర్కిల్ పరిధిలోని నాగారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా ఎస్సై ఐలయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నర్సింహా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.యువత విద్యార్థులు బాలలు రేపటి దేశ భవిష్యత్తు అని మీలాంటి యువత మాదకద్రవ్యాల బారిన పడి భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారు అన్నారు.డ్రగ్స్ వినియోగించడం వల్ల మన యొక్క నాడీ వ్యవస్థ మన ఆధీనంలో ఉండదు అని తద్వారా శక్తి నిర్వీర్యం అవుతుందని ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యువకులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *