డ్రగ్స్ వద్దు ప్రాణం ముద్దని మత్తు పదార్థాలకు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎస్వీ కళాశాల గ్రౌండ్ లో ఉదయం వేళ వచ్చే పాదాచారులకు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగమునకు వ్యతిరేకంగా ఆదివారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. యువతకు సందేశాలతో కనువిప్పు కలిగిస్తూ మత్తు పదార్థాల నిర్మూలనకు తన వంతు క జాతరలు ఉత్సవాలు వారాంత సంతలలో ప్రత్యేక ఉన్న ప్రాంతాలలో మత్తు పదార్థాలు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.మద్యపానం,ధూమపానం ఆరోగ్యానికి హానికరమని మోడ్రక్స్ సేవ్ లైఫ్ అంటూ కరపత్రాలు పంచుతూ చేతిలో మైకు పట్టుకుని ఫ్లెక్సీతో విచిత్ర వేషధారణతో ప్రచారం నిర్వహించారు.
డ్రగ్స్ వద్దు ప్రాణం ముద్దు. డ్రగ్స్ నిర్మూలనకు వినూత్న ప్రచారం

Leave a Comment