మృతుల కుటుంబాలు రాస్తారోకో
* పోలీసుల జోక్యంతో ధర్నా విరమణ
ఎల్లారెడ్డి జూన్- 19(ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి మండల పరిధిలోని మల్లయ్యపల్లి గేట్ వద్ద బుధవారం రాత్రి 9 గంటలకు జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన పీర్య కుటుంబ సభ్యులు గురువారం ఉదయం ఎల్లారెడ్డి మెదక్ రహదారిపై మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగారు. కారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.దీంతో మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై బొజ్జ మహేష్ ఘటన స్థలానికి చేరుకొని… బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని రహదారిపై ఆందోళన కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని కోరినప్పటికీ ఆందోళనకారులు వినలేదు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ రవీందర్ నాయక్ రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులతో మాట్లాడి గుత్తేదారులకు పిలిపించి తమకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందిన మృతుల కుటుంబాలు రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.