జోసా కౌన్సెలింగ్ పై వరంగల్ నిట్ లో అవగాహన సదస్సు

Warangal Bureau
1 Min Read

వరంగల్ బ్యూరో, జూన్ 05 (ప్రజాజ్యోతి)::

NIT, IIT, IIIT ల్లో అడ్మిషన్ నిమిత్తం జోసా కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులకు, తల్లిదండ్రులకు వరంగల్ నిట్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జూన్ 8 న జోసా అభ్యర్థుల కోసం ఓపెన్ హౌస్‌ను నిర్వహించనున్నట్లు నిట్ అధికారులు తెలిపారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ద్వారా ప్రవేశాన్ని కోరుతున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ వారు జూన్ 9, 2025 (ఆదివారం) న అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ లో ఓపెన్ హౌస్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యావేత్తలు మరియు ప్రస్తుత విద్యార్థులతో ప్రత్యక్షంగా ముఖాముఖి సంభాషణ, శాఖల ఎంపిక, సీటు కేటాయింపు, క్యాంపస్ సౌకర్యాలపై సందేహను నివృత్తి చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిట్ వరంగల్ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హాజరు కావలేని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆన్లైన్‌లో వీక్షించవచ్చు. నిట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిడ్యాధర్ సుబుధి, డీన్లు, విభాగాధిపతులు మరియు విద్యార్థుల ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రసంగించి, జోసా కౌన్సిలింగ్ ప్రక్రియలో అభ్యర్థులకు మార్గనిర్దేశనం చేయనున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *