సైబర్ నేరస్తులకు షాక్ ఇచ్చిన పోలీసులు
— కామారెడ్డి పోలీస్ సిబ్బంది.
కామారెడ్డి పట్టణం కి చెందిన లోకుల రాజేందర్ ఈనెల 21న సుమారు 12.15 సమయంలో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు దారుడు రాజేందర్ ను తనకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి, వాళ్ళు టెలికాం సర్వీస్ నుంచి మాట్లాడుతున్నామని మీ ఆధార్ కార్డు మీద ఎవరో సిమ్ కార్డ్ తీసుకోవడం వలన మీ మీద మనీ లాండరింగ్ కేసు నమోదయింది. అని, మీ ఆధార్ కార్డ్ మా దగ్గర ఉంది.ముంబై పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయడానికి వస్తున్నారు. అని భయపెట్టారని, కొంత సమయానికి వాట్సాప్ లో వీడియో కాల్ చేసి, మీ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో చెప్పమని, ఆ డబ్బును వారీ అకౌంట్ కి పంపమని, లేదంటే మిమ్మల్ని (రాజేందర్ ను)అరెస్టు చేస్తాము అని, ముంబై పోలీసులతో కూడిన ఒక ఫేక్ నోటీస్ అతనికి పంపించి భయపెట్టారని, దీనితో అతను భయపడి సిరిసిల్ల రోడ్ ఎస్బిఐ బ్యాంక్ లోని తన అకౌంట్ లో ఉన్న 5,80,000 (ఐదు లక్షల 80 వేల రూపాయలను) గుర్తు తెలియని వ్యక్తులకు పంపడం జరిగింది. ఇతి విషయాన్ని అతను పంపిన అకౌంట్ నెంబర్ ను వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి జరిగినదంతా మాకు పోలీస్ సిబ్బందికి చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీస్ శాఖ బాధితుడికి న్యాయం చేయాలని వెంటనే పోలీసులు సంబంధిత బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి మరియు సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేసి, సంబంధిత బ్రాంచ్ మేనేజర్ ద్వారా ఆ అమౌంట్ మొత్తాన్ని హోల్డ్ చేయ్యటం వల్ల అతను పంపిన మొత్తం 5,80,000/- రూపాయలను తిరిగి అతని అకౌంట్లో రిఫండ్ చేయించడం జరిగింది. సేమ్ పై బాధితులు సంతోషం వ్యక్తం చేశాడు. బాధితులు కామారెడ్డి పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్య విన్నపం ఏమనగా, ఎట్టి పరిస్థితులలో కూడా పోలీసు అని చెప్పి గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్ లకు స్పందించకూడదని, ఒకవేళ అలా ఎవరైనా చేసిన యెడల వెంటనే 100 నంబర్ కి గాని, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి గాని వెళ్లి ఆ సమాచారాన్ని చేరవేయాలని కోరడం జరుగుతుంది.