క్రీడల్లో రాణించిన హార్టికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థులు
• 2025 ఓరల్ ఛాంపియన్షిప్ సాధించిన విద్యార్థులు
గరిడేపల్లి,మే 15(ప్రజా జ్యోతి):
సూర్యపేట జిల్లా గడ్డిపల్లి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మొదట బహుమతి గెలుపొందారు. వనపర్తి జిల్లా మోజెర్ల గ్రామంలోని ఉద్యాన కళాశాలలో ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మే 13,14 న నిర్వహించినట్లు గంటా గోపాల్ రెడ్డి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల సెక్రటరీ డా.ఏం.స్నేహలత తెలియజేశారు.విద్యార్ధిని,విద్యార్థులు క్రికెట్,వాలీబాల్, రంగోలి,ఫోక్ డాన్స్,క్విజ్, స్కిట్,డిబేట్,అథ్లెటిక్స్ అయిన లాంగ్ జంప్,షాట్ పూట్, రన్నింగ్ 100,200,400 మీటర్ల పరుగులో మొదట బహుమతి,కోకో,క్యారమ్, టెన్నీ,కాయిట్,చెస్,దేశభక్తి గీతం,పోస్టర్ ప్రదర్శన లో రెండవ బహుమతి పొందారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన గడ్డిపల్లి విద్యార్థులు ఓరల్ ఛాంపియన్షిప్ 2025 గెలవడం జరిగింది.ముఖ్య అతిథిగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, డీన్ ఆఫ్ హార్టికల్చర్ మరియు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డా.జె.చీన హాజరయ్యారు. చదువుతో పాటు క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చీన తెలిపారు.గెలిచిన విద్యార్థులకు బహుమతులను బహుకరించడం జరిగింది.ఈ సందర్బంగా డా.గంటా గోపాల్ రెడ్డి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో విజయోత్సవ ర్యాలీ మరియు అభినందన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను కెవికె మరియు కళాశాల సిబ్బంది అభినందించారు.ఈ కార్యక్రమం లో ఉద్యాన కళాశాల ఇంచార్జి మరియు కేవికే శాస్త్రవేత్త సి.హెచ్.నరేష్ మరియు శాస్త్రవేత్తలు డి.ఆదర్శ్, ఎ.కిరణ్,టి. మాధురి,ఎన్.సుగంధి,ఆఫీసు సూపరిండెంట్ బి.ఉపేందర్ కళాశాల ఆఫీసు సిబంది బి.సౌమ్య,డి.హర్షిణి,కృష్ణ మరియు 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు.