ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఎంఈఓ ఛత్రు నాయక్

Nalgonda Bureau
1 Min Read

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

ఎంఈఓ ఛత్రు నాయక్

 

గరిడేపల్లి మే 15(ప్రజా జ్యోతి):

ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకే ఉన్నత చదువు,అనుభవం ఉంటుందని,నాణ్యమైన విద్య బోధించడంలో వారు ముందుంటారని మండల విద్యాధికారి ఛత్రు నాయక్ పేర్కొన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని కల్మల్ చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అన్ని సౌకర్యాలు ఉంటాయని ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్,వర్క్ బుక్స్ పలు రకాల అలవెన్స్ కల్పిస్తుందన్నారు. ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారన్నారు.గ్రామంలోని బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు. ఉపాధ్యాయులతో పాటు ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైదులు, ఉపాధ్యాయులు రవి,శ్రీను, నాగయ్య,పిడి సైదిరెడ్డి, పుష్పలత,విజయలక్ష్మి,రేణుక, సిఆర్పిల అశోక్ కుమార్, రామకృష్ణ,గ్రామస్తులు, విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *