సైన్యానికి 7.5 లక్షల ట్రక్కులు అందించేందుకు ముందుకు వచ్చిన ఏఐఎంటీసీ

V. Sai Krishna Reddy
1 Min Read

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌కు ధీటుగా సమాధానమిచ్చింది. పాక్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఈ క్రమంలో భారత సైన్యానికి తమవంతు సాయం చేయడానికి మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ముందుకు వచ్చింది.

ఏఐటీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎల్ ముకాఠి మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన దాదాపు 7.5 లక్షల ట్రక్కులను భారత సైన్యానికి అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో రిజిస్టర్ చేసిన ట్రక్కులను (వాహనాలను) ఉచితంగా సైన్యానికి అందించేందుకు సిద్ధంగా ఉంచామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని ఆయన అన్నారు.

1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా సుమారు వెయ్యి ట్రక్కులను ఆర్మీ కంటోన్మెంట్‌కు అప్పగించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *