పర్వతగిరి, మే 05 (ప్రజాజ్యోతి)
— ప్రాణం పోతేనే పట్టించుకుంటారా..?
— ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి..
— ఇటీవల కారు ప్రమాదంలో తప్పిన ముప్పు..
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నారంషరీఫ్ వెళ్లే దారిలో రావూరు గ్రామంలో దాదాపు ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి వేళ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే ప్రమాదం జరిగిందని తెలిసినా కూడా అన్నారం నుండి మొదలుకొని కల్లెడ గ్రామం వరకు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న వరి దాన్యం రాశులు. దాన్యపు రాసులపై రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు నల్లటి పరదాలను రోడ్డు అనుకోని ఎక్కించి కింద పడుతున్నారు. వడ్ల రాశులు సగం రోడ్డుపై వరకు పోసి పరదాలతో కప్పి పరదాల చుట్టూ రాళ్లతో పెడుతున్నారు. అది నడిరోడ్డు మధ్య వరకు కప్పుతున్నారు. ఎవరిదైనా ప్రాణాపాయం జరిగితే గాని అధికారులు స్పందించరేమో అని వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనాఅధికారులు స్పందించి మరో ప్రమాదం జరగకముందే రోడ్ల మీద ఉన్న ధాన్యపురాశులను ఐకెపి ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించే విదంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు వేడుకుంటున్నారు.
