మ‌స్క్‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌ కాల్… ఏం మాట్లాడారంటే..!

V. Sai Krishna Reddy
1 Min Read

టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ట్రంప్ ప్ర‌భుత్వంలోని డోజ్ విభాగపు అధిప‌తి ఎలాన్ మ‌స్క్‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్‌లో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) ద్వారా వెల్ల‌డించారు. మ‌స్క్‌తో ప‌లు అంశాలపై చ‌ర్చించిన‌ట్లు మోదీ తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వాషింగ్టన్ డీసీలో భేటీ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య జ‌రిగిన విష‌యాలు త‌మ మ‌ధ్య‌ ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై చ‌ర్చించామ‌ని మోదీ అన్నారు. ఈ రంగాల‌లో భార‌త్‌, అమెరికా భాగ‌స్వామ్యం మ‌రింత పురోగ‌మిస్తుంద‌ని ప్ర‌ధాని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కాగా, సుంకాల విష‌యంలో భార‌త్‌, అమెరికా మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌ల అంశం కొన‌సాగుతున్న వేళ ఈ కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *