వీవీఐపీల భద్రత కోసం అధునాతన వాహనాలు

V. Sai Krishna Reddy
1 Min Read

ఏపీలో వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి అతిథుల తాకిడి ఎక్కువైంది.

ఏపీలో వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి అతిథుల తాకిడి ఎక్కువైంది. పెట్టుబడుల పెట్టేందుకు నిత్యం ఎవరో ఒకరు రాష్ట్రానికి వస్తూనే ఉన్నారు. అలాంటి వారి భద్రత ప్రభుత్వానికి సవాల్ గా మారింది. అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల పర్యటన సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొరత సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, వీఐపీల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సివుందని అంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.9.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 10 ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేయనుంది. వీటికి బుల్లెట్ ప్రూఫ్ ఫ్రాబ్రికేషన్ చేయించాలని సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రంలో కొందరు ముఖ్యనేతలు, రాష్ట్రానికి అతిథులుగా వచ్చే వారి కోసం ఈ కొత్త వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *