రూ.3 కోట్ల విలువైన కారును కొనుగోలు చేసిన తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

V. Sai Krishna Reddy
1 Min Read

భారతదేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే అయిన తెలంగాణ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సుమారు రూ.3 కోట్ల విలువైన సరికొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. మెర్సిడెజ్ బెంజ్ జీ580 ఈక్యూ ఎలక్ట్రిక్ (Mercedes Benz g580 eq)ను కొనుగోలు చేశారు. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మెర్సిడెజ్ బెంజ్ ఈ కారును విడుదల చేసింది. మైనంపల్లి రోహిత్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మెదక్ నుండి పోటీ చేసి గెలుపొందారు.

మైనంపల్లి రోహిత్ ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడంతో సామాజిక మాధ్యమంలో వైరల్‍ అయింది. ఆయన డీప్ బ్లాక్ షేడ్‌ ఉన్న ఈ కారును కొనుగోలు చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు లుక్ జీ-వాగెన్ ఐస్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి రెండు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ కోసం, మరొకటి కారు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కోసం ఉంటాయి. ఇందులో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్లు ఉంటాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *