జైళ్లలోనూ కులాల ప్రాతిపదికన బ్రారెక్లు కేటాయించడం.. కులాల ప్రాతిపదికన పనులు చేయించడం ఏంటని సుప్రీంకోర్టు నిలదీసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సాధారణ జైళ్లలోనూ దారుణమైన పరిస్థితి నెలకొందని సుప్రీంకోర్టు తేల్చి చె ప్పింది. ముఖ్యంగా అంటరానితనం విచ్చలవిడిగా సాగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో పరిస్థితులను చక్కదిద్దాలని.. విచారణ ఖైదీలు సహా.. శిక్ష పడిన వారికి మానవ హక్కులు కల్పించాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ సందర్భంగా కీలకమైన జైళ్ల మాన్యువల్లో `కులం` అనే కాలమ్ను రద్దు చేసింది.