పేదల డాక్టర్ గా పిలువబడుతున్న డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ సూర్యాపేట ఇండియన్ మెడికల్ ట్రస్ట్ చైర్మన్ గా శనివారం ఎన్నికయ్యారు. డాక్టర్. ఊర రామమూర్తి యాదవ్ గత 30 ఏండ్లు గా సూర్యాపేట లో హాస్పిటల్ నేల కల్పి ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి మన్నలు పొందుతున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి గిరి దుర్గం అభివృద్ధి కమిటీ చైర్మెన్ గా సేవలు అందించడం తో పాటు మరొక శ్రీ కృష్ణ ట్రస్ట్ నేల కల్పి ప్రతి సంవత్సరం సుమారు 1500 మంది పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్ లను అందిస్తున్నారు.వీరి నియామకం పట్ల పలువురు మిత్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.