నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ స్థాపనకై స్థల పరిశీలన చేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కార్యాలయం నుండి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు బృందం వచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులతో నర్సాపూర్ పట్టణంలోని మెదక్ మార్గంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాదాయ భూములలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సోలార్ ప్లాంట్ స్థాపనకై స్థల పరిశీలన చేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కార్యాలయం నుండి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు బృందం వచ్చింది. ఈ సందర్భంగా స్థల పరిశీలనతోపాటు దగ్గరలో ఉన్న సబ్ స్టేషన్కు పవర్ సప్లై, స్థలంని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు మాట్లాడుతూ.. నర్సాపూర్ మండలంలోని నాలుగు గ్రామ సంఘాల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. మొదటిగా రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావుతోపాటు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, నాబార్డ్ నుండి ఏజీఎం రామారావు, నాబార్డ్ కన్సల్టెంట్ రామకృష్ణ, రెడ్ కో సంస్థ నుండి రవీందర్ చౌహన్ డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్, విద్యుత్ శాఖ ఏడీఈ రమణారెడ్డి, దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాస్, ఏపీఎం గౌరీ శంకర్, ఏపీఓ అంజిరెడ్డి, మండల సర్వేయర్ అభిలాష్, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణ కేంద్రంలో సోలార్ ఉత్పత్తి కేంద్రం
Leave a Comment