మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఆరుగురు (06)పట్టుబడినట్లు ఎస్సై సాయిరాం తెలిపారు.పట్టుబడిన వారిని ఈరోజు 20-06-2025 నాడు కోర్టులో హాజరు పరచగా సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి బి.వి.రమణ ఒక్కరికి ఒక రోజు జైలు శిక్ష మరియు రూ.2,000/- జరిమానా, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన మిగతా ఐదుగురికి (05) కలిపి రూ.6,500/- జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి చలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు.