భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత
* సుమారు 113 క్వింటాళ్ల బియ్యం
* డీసీఎం తో సహా సీజ్..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 6 (ప్రజా జ్యోతి)
కామారెడ్డి పట్టణం, రాజీవ్ నగర్ కాలనీ నందు ఒక ఇంటిలో శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో అక్రమంగా పిడిఎస్ రైస్ ని అక్రమంగా నిలువ ఉంచారు అనే సమాచారం మీద, కామారెడ్డి సిసిఎస్, టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది. రైడ్ చేసి, ఒక డీసీఎం వాహనాన్ని మరియు అందులో ఉన్న దాదాపు 113 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము ను స్వాధీన పరుచుకొని, అక్రమముగా పిడిఎస్ బియ్యాన్ని నిల్వ చేసి రవాణా చేస్తున్న వ్యక్తిని విచారించగా, అతని పేరు షేక్ అర్బజ్ , తండ్రి పేరు యూసఫ్, (24) నివాసము రాజీవ్ నగర్ కాలనీ, కామారెడ్డి అని ,డీసీఎం వాహనాన్ని కిరాయికి తీసుకొని వచ్చి జగిత్యాల పట్టణానికి తరలించాలని అనుకున్నట్టుగా ఒప్పుకోగా, ఇట్టి వారిపై తగు చర్య గురించి సివిల్ సప్లై అధికారులకు తెలియపరచగా, వారు వచ్చి ఇట్టి బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, వాహనము మరియు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి షేక్ అర్బజ్ లపై చర్య గురించి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది.