ఆటోలో పశుమాంసం తరలింపు…పట్టుకున్న గ్రామస్థులు
నాగిరెడ్డిపేట్,జూన్ 05(ప్రజాజ్యోతి)
ఆటోలో పశుమాంసం తరలిస్తుండగా పోచారం గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.గ్రామస్థులు వివరాల ప్రకారం జిల్లా సరిహద్దు గ్రామం అయినా పోచారం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనంను క్షుణంగా తనిఖీ చేస్తుండడంతో పోచారం గ్రామంలోని హనుమాన్ మందిరం నుంచి పోచారం ప్రధాన కాలువకు వెళ్లే దారిలో ఆటోలో పశుమాంసం తరలిస్తుండడంతో గ్రామస్థులు పట్టుకున్నారు.పశువులను తరలించకుండా మండల కేంద్రంలోని పశువులను వదించి ఆటోలో వివిధ ప్రాంతాలకు,రవాణా చేస్తున్నారని ప్రధాన రహదారిలో చెక్ పోస్ట్ ఉండడంతో అడ్డదారిలో తరలిస్తు పట్టుబడ్డారని పట్టు బడ్డ ఆటోను పోలీసులకు అప్పగించినట్లు గ్రామస్థులు తెలిపారు.