తాసిల్దార్ కు యాక్సిడెంట్ ఇద్దరికి గాయాలు
ప్రజా జ్యోతి జుక్కల్ ప్రతినిది జూన్ 04
పెద్ద కొడపగల్ మండలంలోనీ అంజనీ గేటు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్ మండలం తహసీల్దార్ మహేందర్ కుమార్ పిట్లం నుంచి తన కారులో జుక్కల్ కు వెళ్తున్న క్రమంలో పెద్ద కొడపగల్ మండలం అంజనీ గేటు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం లారీ కారును బలంగా ఢీ కొట్టింది.దీంతో కారులో ఉన్న జుక్కల్ తహసీల్దార్ మహేందర్ కుమార్ , డీసీఎం లారీ డ్రైవర్ ఖలీద్ లకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచి చికిత్స అందించడానికి మహేందర్ కుమార్ ను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.